20న ఏన్టీఆర్‌ శత జయంతి సభ

– ఏర్పాట్లను పరిశీలించిన టీటీడీపీ
– అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌, టీడీ జనార్దన్‌
నవతెలంగాణ – హైదరాబాద్‌
ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవ సభ ఈనెల 20న హైదరాబాద్‌ కూకట్‌పల్లి కైతలాపూర్‌ గ్రౌండ్‌లో జరగనుంది. ఈసందర్భంగా సావనీర్‌, వెబ్‌సైట్‌ ఆవిష్కరణ చేపడతారు. సభాఏర్పాట్లను మంగళవారం పార్టీ నాయకులతో కలిసి తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్‌ పరిశీలించారు. సభా వేదిక నిర్మాణం,సభా నిర్వహణ కమిటీల ఏర్పాటు, జన సమీకరణ, తదితర కార్యక్రమా లపై పార్టీ నాయకులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల నిర్వహణ కమిటీ చైర్మెన్‌ టి డి జనార్దన్‌రావు, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు రావుల చంద్రశేఖర్‌రెడ్డి, నందమూరి రామకష్ణ, జాతీయ అధికార ప్రతిని ధి టి. జ్యోత్స్న, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన, బీసీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపతి సతీష్‌, ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు పి.అశోక్‌, ఎస్టీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు గోపీ, ఐటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు హరికష్ణ, టీడీపీ మీడియా వ్యవహారాల కో ఆర్డినేటర్‌ బియ్యని సురేష్‌,మీడియా కమిటి చైర్మెన్‌ ప్రకాష్‌రెడ్డి,చేవెళ్ల, మల్కా జిగిరి పార్లమెంటు పరిశీలకులు సుబాష్‌ యాదవ్‌, అశోక్‌ కుమార్‌ గౌడ్‌, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి సాయి తులసి మున్సిపల్‌ డివిజన్ల నాయకులు పాల్గొన్నారు.

Spread the love