నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు సోమవారం టీపీసీసీ విస్తృతస్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు రేవంత్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశానికి రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మాణిక్రావు ఠాక్రే హాజరుకానున్నారు. పీసీసీ కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల చైర్మెన్లు, పీసీసీ సభ్యులు సమావేశంలో పాల్గొంటారు.