నవతెలంగాణ-హైదరాబాద్
తెలుగుదేశం పార్టీ సంస్థాగత నిర్మాణ ప్రక్రియలో భాగంగా మరో మూడు పార్ల మెంటు నియోజక వర్గాలకు పార్టీ అధ్యక్షులను ఆ పార్టీ తెలంగాణ శాఖ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ నియమించారు. హైదరాబాద్ పార్లమెంటు నియోజవర్గం అధ్యక్షులుగా అలీ మస్కతి, సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గ అధ్యక్షులుగా పి.సాయిబాబా, పెద్దపల్లి పార్ల మెంటు నియోజకవర్గ అధ్యక్షులుగా బి.సంజరుకుమార్ను నియమిస్తూ నియామక ఉత్తర్వులు జారీచేశారు. బుధవారం ఎన్టీఆర్ భవన్లో హైదరాబాద్, సికింద్రాబాద్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల ముఖ్య నాయకులతో జ్ఞానేశ్వర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణం, కార్యక్రమాల అమలు, నాయకులు పనితీరుతో పాటు ఆయా నియోజకవర్గాల వారీగా పార్టీ స్థితిగతులపై నాయకులతో చర్చించారు. ఈ సందర్భంగా పార్లమెంటు, ఇతర స్థానిక కమిటీల నియామకంపై అభిప్రాయాలు తీసుకొన్నారు.