యం.వి రమణను పరామర్శించిన పల్లె రవికుమార్‌ గౌడ్‌

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎంవీ రమణను గీత పారిశ్రామిక ఆర్థిక సహకార సంస్థ చైర్మెన్‌ పల్లె రవికుమార్‌ గౌడ్‌, సుప్రజా ఆస్పత్రి ఎండీ శిగ విజరు కుమార్‌ గౌడ్‌తో కలిసి శుక్రవారం పరామర్శించారని కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల సుప్రజా ఆస్పత్రిలో చెవి కర్ణభేరికి ఆపరేషన్‌ చేయించుకున్న రమణ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. గౌడ కల్లు గీత సంఘాల సమన్వయ కమిటీ రాష్ట్ర చైర్మెన్‌ బాలగౌని బాలరాజు గౌడ్‌, గౌడ హాస్టల్‌ చైర్మెన్‌ పల్లె లక్ష్మణ్‌ గౌడ్‌ , తెలంగాణ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ట్రెజరర్‌ పుల్లెంల రవీందర్‌ , గోపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ బండి సాయన్న , గీత పనివారాల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొమ్మగాని ప్రభాకర్‌, వివిధ సంఘాల నాయకులు అయిలి వెంకన్న గౌడ్‌, యెలికట్టె విజరు కుమార్‌ గౌడ్‌, అంబాల నారాయణ గౌడ్‌, సినీ డైరెక్టర్‌ పులి అమత్‌ గౌడ్‌, విగేష్‌ ,రాళ్ల బండి కుమారస్వామి, చెన్నారం మల్లేష్‌ , జ్యోతి ఉపేందర్‌, పల్లె ఉపేందర్‌ గౌడ్‌, వంగ రాములు గౌడ్‌, ముద్దగౌని రామ్మోహన్‌ గౌడ్‌, కోల జనార్ధన్‌, మిట్టపల్లి విజరు , పాముకుంట్ల రవీందర్‌ గౌడ్‌, పండరి గౌడ్‌, మాటూరి బాలరాజ్‌ గౌడ్‌ తదితరులు పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

Spread the love