జర్నలిస్ట్‌లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలి : ఏఐఎస్‌ఎఫ్‌

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
జర్నలిస్ట్‌లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర సమితి డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 2014 ఎన్నికల్లో జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇస్తామంటూ హామీ ఇచ్చినా ఇప్పటికీ నెరవేరలేదని తెలిపారు. వారిని రాష్ట్ర ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరైంది కాదని పేర్కొన్నారు. జర్నలిస్టులకు సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, ఇండ్లస్థలాలు ఇవ్వాలని, ఆరోగ్య కార్డులు అందరికీ ఇవ్వాలని కోరారు. అక్రిడిటేషన్‌ కార్డుల జారీలో జాప్యం తగదని తెలిపారు.

Spread the love