కేజీబీవీ సిబ్బంది బదిలీలకు నేటినుంచి వెబ్‌ ఆప్షన్లు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో నడుస్తు న్న కస్తూర్బా (కేజీ బీవీ)ల్లో తాత్కాలిక పద్ధతిపై పనిచేస్తున్న సిబ్బంది బదిలీల కోసం శనివారం నుంచి వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ మేర కు పాఠశాల విద్యాశాఖ సం చాలకులు శ్రీదేవసేన శుక్రవారం సవరణ షెడ్యూల్‌ను విడుదల చేశారు. కేజీబీవీల్లో పని చేస్తున్న స్పెషల్‌ ఆఫీసర్లు, పీజీసీఆర్టీలు, సీఆర్టీ లు, ఏఎన్‌ఎంలు, అకౌంటెంట్లు, పీఈటీలు ప్రస్తు తమున్న కేజీబీవీ నుంచి అదే జిల్లాలో, ఇతర జిల్లాల్లోని కేజీబీవీలకు మార్పుకోరే వారితోపాటు స్పౌజ్‌ వారికీ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నామని తె లిపారు. ఈనెల 27 నుంచి 29 వరకు కొత్త కేజీబీవీల్లో చేరేందుకు కొత్త కాంట్రాక్టును ఆఫ్‌ లైన్‌లో అందజేస్తామని వివరించారు.

Spread the love