ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా నామినేష‌న్ దాఖ‌లు చేసిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ :  జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పిఠాపురం ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా మంగ‌ళ‌వారం నామినేష‌న్ దాఖ‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా త‌న నామినేష‌న్ ప‌త్రాల‌ను ఎన్నిక‌ల రిట‌ర్నింగ్ అధికారికి ప‌వ‌న్ అంద‌జేశారు. ఈ కార్య‌క్ర‌మంలో న‌టుడు నాగ‌బాబు, పిఠాపురం టీడీపీ ఇంచార్జి వ‌ర్మ పాల్గొన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజ‌క‌వ‌ర్గం చేబ్రోలులోని నివాసం నుంచి ప‌వ‌న్ భారీ ర్యాలీగా బ‌య‌ల్దేరారు. ఈ ర్యాలీ చేబ్రోలు నుంచి పిఠాపురంలోని పాద‌గ‌య క్షేత్రం వ‌ర‌కు కొన‌సాగింది. జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, ఆయ‌న అభిమానులు ఈ ర్యాలీలో భారీ సంఖ్య‌లో పాల్గొన్నారు. ప‌వ‌న్ జాతీయ జెండా ప‌ట్టుకుని ప్ర‌జ‌ల‌కు అభివాదం చేస్తుండ‌గా ర్యాలీ ముందుకు సాగింది.

Spread the love