నవతెలంగాణ న్యూఢిల్లీ: తెలంగాణ, కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు పదోన్నతి లభించనుంది. సుప్రీంకోర్టు జడ్జిగా జస్టిస్ ఉజ్జల్ భుయాన్ను కొలీజియం సిఫార్సు చేసింది. ఉజ్జల్ భుయాన్ ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు సీజేగా ఉన్నారు. అలాగే సుప్రీంకోర్టు జడ్జిగా వెంకటనారాయణ భట్టిని కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఆయన కేరళ హైకోర్టు సేజేగా ఉన్నారు.