మాజీ మావోయిస్టు హత్యపై నిరసనలు..

నవతెలంగాణ-హైదరాబాద్ : సూర్యాపేట జిల్లా ఎల్కారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మాజీ మావోయిస్టు ఎల్లయ్య హత్యపై నిరసనలు వెల్లువెత్తాయి. ఎల్లయ్య ప్రత్యర్థుల ఇళ్లపై రాళ్ల దాడులు జరిగాయి. ఆందోళన కారులు ప్రత్యర్థుల ఇళ్లలో ఫర్నిచర్ ధ్వంసం చేయడంతో హై టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. నిరసనకారుల ఆందోళన దృష్ట్యా గ్రామంలో వారం రోజులుగా పోలిస్ పికెట్ నిర్వహిస్తున్నారు. దాడుల దృష్ట్యా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Spread the love