సమస్యల పరిష్కారంలో పీఆర్టీయూ ముందంజ

– జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల సతీష్ రెడ్డి

నవతెలంగాణ – పెద్దవంగర: ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో పీఆర్టీయూ ఎల్లప్పుడూ ముందంజలో ఉంటుందని జిల్లా ప్రధాన కార్యదర్శి మిర్యాల సతీష్ రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని పలు ప్రభుత్వ పాఠశాలల్లో పీఆర్టీయూ మండల అధ్యక్షుడు గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మిర్యాల సతీష్ రెడ్డి, గొట్టిముక్కుల శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..ప్రాథమిక సభ్యులు ప్రతి ఒక్కరూ సంఘానికి పునాది అన్నారు. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం, సభ్యత్వ నమోదులోను పీఆర్‌టీయూ అగ్రభాగాన నిలిచిందని పేర్కొన్నారు. అతి త్వరలోనే ఉపాధ్యాయ బదిలీలు, పదోన్నతులు, ఐఆర్, పీఆర్సీ అమలు కోసం పీఆర్టీయూ బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గంగిశెట్టి రమేష్, రాష్ట్ర బాధ్యులు ప్రభాకర్ రెడ్డి, సోమయ్య, జిల్లా బాధ్యులు యాకూబ్ పాషా, అంజయ్య, రాజేష్ కుమార్, శ్రీను, నరేందర్ రెడ్డి, కవిరాజు తదితరులు పాల్గొన్నారు.
Spread the love