న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండిస్టీస్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్లో ఖతార్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యుఐఎ) రూ. 8278 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనుంది. దీంతో రిలయన్స్ రిటైల్లో 0.99 శాతం వాటాను క్యుఐఎ పొందనుంది. ఈ మేరకు రిలయన్స్ సంస్థ రెగ్యూలేటరీ సంస్థలకు సమాచారం ఇచ్చింది. రిలయన్స్ రిటైల్ చివరిసారిగా 2020లో అంతర్జాతీయంగా వేర్వేరు ఇన్వెస్టర్ల నుంచి సుమారుగా రూ.47 వేల కోట్లకుపైగా నిధులను సమీకరించింది. దేశంలో రిలయన్స్ రిటైల్కు 18,500 స్టోర్లున్నాయి.