ఈటెల రాజేందర్ ను కలిసిన ముదిరాజ్ ప్రతినిధులు..

నవతెలంగాణ డిచ్ పల్లి.

తెలంగాణ రాష్ట్ర బిజెపి ప్రచార కమిటీ చైర్మన్ గా నియామకం పొందిన ఈటెల రాజేందర్ ను ముదిరాజ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, దర్పల్లి మాజీ ఎంపీపీ ఇమ్మడి గోపి అధ్వర్యంలో బుధవారం హైదరాబాద్ లో కలిసి పుష్ప గుచ్చం అందజేసి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. కలిసిన వారిలో దర్పల్లి మండల ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మచ్చ రఘురాం, జిల్లా మత్య్స శాఖ అధ్యక్షులు మద్ది గంగాధర్,ఎల్ ఐ సి గంగాధర్,బుచ్చన్న తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Spread the love