– మధుబన్కాలనీ పాఠశాలలోని సమస్యలను పరిష్కరిస్తాం : ఎంఈఓ రామిరెడ్డి
– విద్యార్థులకు రెండో జత యూనిఫాం పంపిణీ
నవతెలంగాణ-రాజేంద్రనగర్
రాజేంద్రనగర్ నియోజకవర్గం పరిధిలోని మధుబన్కాలనీ మండల ప్రాథమిక పాఠశాలలో ఇద్దరే ఉపాధ్యాయులు, పాఠశాలల సమస్యలపై నవ తెలంగాణ పత్రికలో ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. రాజేం ద్రనగర్ మండల విద్యాధికారి రామిరెడ్డి స్పందిస్తూ ప్రాథమిక పాఠశాలలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తానని అన్నారు. విద్యార్థులకు రెండో జత యూనిఫాంలో పంపిణీ చేశామని తెలిపారు. అదేవిధంగా ఉపాధ్యాయుల కొ రత లేకుండా చూస్తామని అన్నారు. గతంలో సెలవులపై వెళ్లిన ఒక ఉపా ధ్యాయురాలు తిరిగి విధుల్లోకి త్వరలో హాజరవుతారని, అదేవిధంగా డిప్యూ టేషన్ మీద మరో ఉపాధ్యాయురాలు ఇక్కడ పని చేస్తుందని చెప్పారు. ఇక తరగతి గదుల సమస్యను త్వరలో ‘మన ఊరు-మనబడి’ ప్రణాళికలో నూ తన తరగతు గదుల నిర్మాణానికై ప్రతిపాదనలు పంపుతామని తెలిపారు.