రంగాపూర్ లో దొంగల హల్ చల్

– 1 లక్ష రూపాయల నగదు, 25వేల స్మార్ట్ ఫోన్ చోరీ
నవతెలంగాణ-తాడ్వాయి
ములుగు జిల్లా తాడ్వాయి మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన కిరాణం వ్యాపారి మానేపల్లి అయ్యప్ప ఇంట్లో శుక్రవారం అర్ధరాత్రి లక్ష, 25 వేల రూపాయల నగదు, 25 వేల విలువచేసే స్మార్ట్ ఫోన్ తెలియని దొంగలు అపారించుకుపోయారు. బాధితుడు చిరు వ్యాపారి అయ్యప్ప లబోదిబోమని ఏడ్చారు. కిరాణం అభివృద్ధికి అప్పు తెచ్చిన పైసలు దొంగలు ఎత్తుకొని పోవడంతో కుటుంబం మొత్తం దుఃఖసాగరంలో మునిగింది. కిరాణం వ్యాపారి మానేపల్లి అయ్యప్ప ఇంట్లో దొంగలు పడి లక్ష రూపాయలు సెల్ఫోన్ దొంగలించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. శనివారం ఉదయం స్థానిక పోలీస్ స్టేషన్లో బాధితుడు మానేపల్లి అయ్యప్ప ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love