రథోత్సవాల కోసం ఆలయ కమిటీకి విరాళమిచ్చిన సంతోష్ మేస్త్రి

– విరాళం అందజేసిన సంతోష్ మేస్త్రికి ఆలయ కమిటీ అభినందన
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండల కేంద్రంలోని రథం గల్లి లో గల శ్రీ లక్ష్మీనారాయణ రథోత్సవాలు ఈనెల 23 24 రెండు రోజులపాటు జరగనున్నాయి. ఈ ఉత్సవాల కోసం మద్నూర్ మండల కేంద్రానికి చెందిన సంతోష్ మేస్త్రి రూ.51 వేల రూపాయలు విరాళంగా ఆలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఉత్సవాల కోసం భారీ మొత్తంలో విరాళ మంద చేసిన సంతోష్ మేస్త్రికి శ్రీ లక్ష్మీ నారాయణ ఆలయ కమిటీ సభ్యులు అభినందనలు తెలియజేశారు. విరాళం అందజేత కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ సందుర్ వార్ హనుమాన్లు కమిటీ ప్రధాన కార్యదర్శి కంచివార్ రవి ఆలయ కమిటీ కోశాధికారి కంచిన్వార్ నాగేష్ గ్రామ పెద్దలు మద్నూర్ సింగిల్ విండో మాజీ చైర్మన్ పాకల్ వార్ విజయ్ వీరితో పాటు బొగ్గుల వార్ సంజు అవార్వార్ హనుమాన్లు అవార్వార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

Spread the love