- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలోని హనుమాన్ ఆలయంలో నిర్వహించిన ధ్వజస్తంభన, శిఖర ప్రతిష్టాపన, నంది ప్రతిష్టాపన, మహా అన్నదాన కార్యక్రమాల్లో గ్రామ సర్పంచ్ ఉషా సంతోష్ మేస్త్రి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆలయాభివృద్ధికి మాతో పాటు గ్రామస్తుల కృషి అభినందనీయమని సర్పంచ్ దంపతులు పేర్కొన్నారు. కార్యక్రమంలో అభివృద్ధి కమిటీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ధరాస్ సాయిలు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



