మైన‌ర్ బాలుడిపై లైంగిక వేధింపులు..

నవతెలంగాణ – చెన్నై : లిఫ్ట్ ఇస్తాన‌ని చెప్పి మైన‌ర్ బాలుడిని బైక్‌పై ఎక్కించుకుని ఆపై లైంగిక వేధింపుల‌కు పాల్ప‌డిన బీజేపీ కార్య‌క‌ర్త‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. త‌మిళ‌నాడులోని విల్లివాక్కం జిల్లాలో ఈ ఘ‌ట‌న వెలుగుచూసింది. బాలుడిని బైక్‌పై ఎక్కించుకున్న కాషాయ పార్టీ కార్య‌క‌ర్త బాల‌చంద్ర‌న్ అత‌డిని పాడి బ్రిడ్జి కింద నిర్మానుష్య ప్ర‌దేశానికి తీసుకువెళ్లి లైంగిక వేధింపుల‌కు గురిచేశాడు. బైక్‌పై నుంచి దిగిన త‌ర్వాత బాలుడు ఏడుస్తుండ‌గా స్ధానికులు ప్ర‌శ్నించ‌డంతో ఈ వ్య‌వ‌హారం వెలుగుచూసింది. బాల‌చంద్ర‌న్‌ను ప‌ట్టుకున్న స్ధానికులు అత‌డిని నిల‌దీయ‌గా పారిపోయేందుకు ప్ర‌య‌త్నించాడు. నిందితుడి వాహ‌నంలో పార్టీ జెండా, ఐడీ కార్డు ల‌భ్య‌మ‌య్యాయి. బాలుడి త‌ల్లి ఫిర్యాదుతో బాల‌చంద్ర‌న్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు కేసు న‌మోదు చేసి త‌దుప‌రి ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేశారు.

Spread the love