వ్యాన్ ను ఢీకొట్టిన ట్రక్కు..ఆరుగురు మృతి

నవతెలంగాణ-హైదరాబాద్ : ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బలోడా బజార్ జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాలారి పోలీస్ స్టేషన్ పరిదిలోని గోడా బ్రిడ్జి సమీపంలో 30 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న వ్యాన్ను ట్రక్కు ఢీకొట్టడంతో ఆరుగురు ఘటనా స్థలంలోనే చనిపోయారు. మృతులు ఒక శిశులు, ఒక మహిళ, నలుగురు పురుషులు ఉన్నారు, ఎస్‌ఎస్‌పి దీపక్ ఝా తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన 20 మందిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులలో కూడా నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. ట్రాఫిక్‌కు అంతరాయ లేకుంగా క్రేన్ సహాయంతో వాహనాలను పక్కకు తొలగించారు.

Spread the love