నవతెలంగాణ ఢిల్లీ: పాతికేండ్లు లోక్సభకు ప్రాతినిధ్యం వహించిన కాంగ్రెస్ (Congress) అగ్ర నాయకురాలు సోనియాగాంధీ (Sonia Gandhi) తొలిసారి పెద్దల సభలోకి అడుగుపెట్టబోతున్నారు. రాజస్థాన్ నుంచి ఆమె రాజ్యసభ (Rajya Sabha)కు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు బీజేపీ (BJP) జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సైతం గుజరాత్ నుంచి ఎలాంటి పోటీ లేకుండానే రాజ్యసభకు ఎన్నికయ్యారు. గతంలో 2012, 2018లో నడ్డా హిమాచల్ ప్రదేశ్ నుంచి ఎగువసభకు ప్రాతినిధ్యం వహించగా… అక్కడ వారికి తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ఆయన గుజరాత్కు మాకాం మార్చారు.