పసర లో ప్రత్యేక పారిశుద్ధ్య వారోత్సవాలు కార్యక్రమం

నవతెలంగాణ – గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య వారోత్సవాల కార్యక్రమంలో భాగంగా శనివారం విద్యుత్ సబ్ స్టేషన్ ఏరియాలో పిచ్చి మొక్కల తీసివేసే కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సర్పంచ్ ముద్దబోయిన రాము కార్యదర్శి శరత్ బాబు లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యదర్శి శరత్ మాట్లాడుతూ ఈనెల 22 వరకు ఈ ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలను యధావిధిగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గ్రామపంచాయతీ పరిధిలో పలు వీధులలో పిచ్చి మొక్కలు ఉన్నట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. మురుగునీరు నిలువ ఉన్న ప్రాంతాలను కూడా గుర్తించి శుభ్రపరచనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పారిశుధ్య లోపం ఉన్న ప్రాంతాలను గుర్తిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు యల్లముల అనూష రాజశేఖర్ పంచాయతీ సిబ్బంది కుమార్ సీతారాములు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love