ఒలింపియాడ్ లెవెల్ -2 ఫలితాల్లో లాప్టాప్ గెల్చుకున్న శ్రీ చైతన్య విద్యార్థి

నవతెలంగాణ – కంటేశ్వర్
ఇండియన్ నేషనల్ టాలెంట్ సర్చ్ ఒలింపియాడ్ లెవెల్ -2 పరీక్ష ఫలితాల్లో శ్రీ చైతన్య నిజామాబాద్ బ్రాంచ్-1 పాఠశాల జయకేతనం
సాధించిందని ఇటీవల విడుదల చేసిన ఒలింపియాడ్ ఫలితాల్లో 307 విద్యార్థులు విజేతలు కాగా 48 బంగారు పతకాలను బహుమానాలను పొందడం జరిగిందని శ్రీ చైతన్య పాఠశాల ఏజీఎం జితేందర్, కోఆర్డినేటర్ నరేందర్ తెలిపారు. 6వ తరగతి (సి-బ్యాచ్) చదువుతున్న అస్స నిషిత్ టాప్ లో రాణించి లెనోవో లాప్టాప్ ను గెలుచుకున్నాడని, బహుమతి ప్రధాన కార్యక్రమం శుక్రవారం సాయంత్రం జరిగింది. పోటీలో గెలుపొందినటువంటి విద్యార్ధులందరికీ బహుమతులను శ్రీ చైతన్య పాఠశాల ఏజీఎం జితేందర్, కోఆర్డినేటర్ నరేందర్ చేతుల మీదుగా లాప్టాప్ ను అస్సం నిషిత్ అనే విద్యార్థికి పలు విద్యార్థులందరికీ బహుమతులను అందించడం జరిగింది. గతకొన్ని సంవత్సరాలుగా గ్రాండ్ ప్రైజ్, ఎక్కువ మొత్తంలో బహుమతులు రావడం సంతోషంగా ఉందని, ఏజీఎం జితేందర్, కోఆర్డినేటర్ నరేందర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం.డి బాకర్ హుస్సేన్ విద్యార్ధులను అభినందించారు. కార్యక్రమంలో స్కూల్ అకడమిక్ డీన్ ఈశ్వర్, ఐపీఎల్ ఇన్చార్జి శివకుమార్, సి బ్యాచ్ ఇన్చార్టి రాజు పాల్గొన్నారు.
Spread the love