- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండల పరిషత్ ఉద్యోగంతోపాటు వివిధ పదవుల్లో సుదీర్ఘకాలం విశిష్ట సేవలందించి మండల సూపర్ డెంట్ గా ఉద్యోగ పదవి విరమణ పొందిన గంటి శ్రీరామమూర్తి సేవలు అభినందనీయమని మండల తహశీల్దార్ రవికుమార్ అన్నారు. గురువారం మండల పరిషత్ కార్యక్రమంలో ఆత్మీయ సన్మాన మహోత్సవ కార్యక్రమానికి తహసీల్దార్ హాజరై సూపర్ డెంట్ దంపతులను శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తాడిచెర్ల జిపిఓ గొట్టం నరేశ్, మహర్షి, పంచాయతీ కార్యదర్శులు మల్లిఖార్జున రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు యాదవ్, సతీష్, ఈజీఎస్ సిబ్బంది, ఎంపిడిఓ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -



