నవతెలంగాణ-హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్పై రాళ్ల దాడి జరిగింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా విజయవాడలోని సింగ్ నగర్లో శనివారం మేమంతా సిద్ధం బస్సు యాత్ర చేస్తుండగా గుర్తు తెలియని ఆగంతకులు జగన్పై రాళ్ల విసిరారు. ఈ ఘటనలో జగన్ ఎడమ కంటికి ఓ రాయి ఫోర్స్గా తగలడంతో కంటికి స్వల్ప గాయమైంది. వెంటనే అప్రమత్తమైన సీఎం భద్రతా సిబ్బంది జగన్కు బస్సులోనే ప్రథమ చికిత్స అందించారు. ఫస్ట్ ఎయిడ్ తర్వాత తిరిగి జగన్ బస్సు యాత్రను కొనసాగించారు. సీఎంపై రాళ్ల దాడి జరగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వెంటనే అలర్ట్ అయిన భద్రతా సిబ్బంది సీఎంపై రాళ్లు రువ్విన ఆగంతకులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. కాగా, ఈ ఇన్సిడెంట్కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.