కవితక్కను అత్యధిక మెజారిటీతో గెలిపించాలి: సూడి శ్రీనివాసరెడ్డి ఎంపీపీ

నవతెలంగాణ – గోవిందరావుపేట
మహబూబాబాద్ పార్లమెంట్ బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కవితక్కను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఎంపీపీ సూడి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం మండలంలోని ముత్తాపురం గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ విస్తృత ఎన్నికల ప్రచారంలో శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.బూర సురేందర్ గౌడ్ గారు  గడపగడపకు తిరుగుతూ. కేసీఆర్ గారి సంక్షేమ పథకాలను. ఓటర్లకు వివరిస్తూ. విసృతంగా ప్రచారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా సమస్యలను పార్లమెంటులో వినిపించే సత్తా టిఆర్ఎస్ పార్టీకి మాత్రమే ఉందని అన్నారు. గత ఎంపీగా అనుభవమున్న కవితక్క మల్లి ఎంపీగా పార్లమెంటులో అడుగు పెడితే అభివృద్ధి పథలో ముందుకు సాగుతామని అన్నారు. ఈ కార్యక్రమంలో సమన్వయ కమిటీ నాయకులు బూర సురేందర్, ఎంపీటీసీలు వెలిశాల స్వరూప, లావుడియా రామచంద్రనాయక్ స్థానిక టిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షుడు పాయం సమ్మయ్య ,వంక లక్ష్మణ్, పస్రా గ్రామ అధ్యక్షుడు తాటికొండ శ్రీనివాస్ చారి, కొండి రమేష్ మరియు బూత్ ఇంచార్జ్ లు, ముఖ్య నాయకులు తదితరులుపాల్గొన్నారు.
Spread the love