జర్నలిస్టు కాలనీకి స్వచ్ఛ అవార్డు..

నవతెలంగాణ – ఆర్మూర్: పట్టణంలోని జర్నలిస్ట్ కాలనీ కి స్వచ్చ కాలనీ, స్వచ్ఛ వార్డు అవార్డు వచ్చింది, కాలనీ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమాన్ని మున్సిపల్ అధికారులు గుర్తించారు. శుక్రవారం జరిగిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత, కమిషనర్ చేతుల మీదుగా జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్, ప్రధాన కార్యదర్శి కమలాకర్ ఈ అవార్డును, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అశోక్ ను ప్రత్యేకంగా అభినందించారు. ఇతర కాలనీల ప్రజలు జర్నలిస్ట్ కాలనీని ఆదర్శంగా తీసుకుని స్వచ్ఛ కాలనీలుగా అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. మున్సిపల్ వైస్ చైర్మన్ మున్ను, కౌన్సిలర్లు, అధికారులు, కాలనీ కమిటీ ప్రతినిదులు కొండి పవన్, రాజు, రాజ్ కుమార్, దినేష్ తదితరులు పాల్గొన్నారు

Spread the love