స్వరాష్ట్రంలో పరిశ్రమలకు స్వర్ణయుగం పెట్టుబడులకు స్నేహపూర్వక హస్తం

–  ప్రపంచానికి ఆదర్శంగా టీఎస్‌ఐపాస్‌…15 రోజుల్లోనే అనుమతులు
– 23 వేల పరిశ్రమలు… రూ.2.64 కోట్ల పెట్టుబడులు
– 17.77 లక్షల మందికి ఉపాధి
దశాబ్ది ఉత్సవాల్లో నేడు పారిశ్రామిక, ఐటీ రంగాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
వేలల్లో పరిశ్రమలు.. లక్షల కోట్ల పెట్టుబడులు.. లక్షల సంఖ్యలో ఉపాధి అవకాశాలు..సులభ వాణిజ్యంలో నెం.1.. ఇదీ తెలంగాణ పారిశ్రామికం.. ప్రపంచం దారిపట్టిన ఎర్రతివాచీ వనం. ‘పరిశ్రమలు వర్ధిల్లాలి. ఉపాధి పెరగాలి. తెలంగాణ పచ్చబడాలి’ అనే ధ్యేయంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు పెద్దపీటవేసింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా సమాచార, పౌరసంబంధాల శాఖ కమిషనర్‌ సంబంధిత వివరాలతో కూడిన ప్రకటన సోమవారం విడుదల చేశారు. ప్రపంచంలోనే నెంబర్‌వన్‌ పారిశ్రామిక విధానాన్ని అమలు చేస్తూ తెలంగాణను 23 వేల పరిశ్రమలకు అడ్డాగా మార్చింది. ఈ పరిశ్రమల ద్వారా 17 లక్షలకు పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా ఐటీ, ఔషధాలు, ఆహార శుద్ధి, విమానయానం తదితర రంగాల్లో తెలంగాణ దూసుకుపోతున్నది. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక చొరవతో అనేక దేశీయ, విదేశి కంపెనీలు రాష్ట్రానికి క్యూ కడుతున్నాయి.
టీఎస్‌ఐపాస్‌తో….
రాష్ట్ర ప్రభుత్వం 2015లో టీఎస్‌ఐపాస్‌ చట్టాన్ని తీసుకురావటంతో ప్రపంచస్ధాయి కంపెనీలు తెలంగాణ వైపు చూడటం మొదలుపెట్టాయి. పెట్టుబడులకు ఉన్న అడ్డంకులు తొలిగి, సులభతర అనుమతులు లభించటంతో పారిశ్రామిక రంగ ముఖ చిత్రం పూర్తిగా మారిపోయింది. పరిశ్రమలకు కావాల్సిన భూమిని సిద్ధం చేయటం, ప్రపం చస్ధాయి మౌలిక సదుపాయాలు కల్పించటం, స్నేహపూర్వక విధానాలు, మెరుగైన ప్రోత్సాహకాలతో తెలంగాణకు ఎదురులేకుండా పోయింది. ముంబై, చెన్నై, బెంగళూరు, నోయిడా వంటి నగరాలను కాదని రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. 24 గంటలు విద్యుత్తు, మెరుగైన శాంతిభద్రతలు, స్థిరమైన, సమర్థవంతమైన పరిపాలన పరిశ్రమలకు వరంగా మారాయి. జాతీయ, అంతర్జాతీయ సంస్థలు ఎన్నింటికో ఇప్పుడు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానమైందని కమిషనర్‌ ఆ ప్రకటనలో తెలిపారు.
ఇండిస్టియల్‌ పార్కులు
రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ప్రఖ్యాత ఫార్మాసిటీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రపంచంలోనే అతి పెద్ద సమీకత ఔషధ క్లస్టర్‌గా దీన్ని 14,029 ఎకరాల్లో అభివద్ధి చేయనున్నారు. రూ.64వేల కోట్ల పెట్టబడులు వస్తాయని, 4.20లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్నది. జహీరాబాద్‌లో మల్టీ ప్రొడక్ట్‌ తయారీ జోన్‌ను ప్రతిపాదించారు. 12,635 ఎకరాల్లో నిమ్జ్‌ పథకం కింద మొదటి దశలో 3,909 ఎకరాలను కేటాయించారు. దీని ద్వారా 2.77 లక్షల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. హైదరాబాద్‌- నాగపూర్‌ ఇండిస్టీయల్‌ కారిడార్‌లో భాగంగా దీన్ని అభివద్ధి చేయాలని నిర్ణయించారు. మహేశ్వరంలో రెండు ఎలక్ట్రానిక్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్లను అభివద్ధి చేశారు. ఇందులో రావిర్యాల క్లస్టర్‌ 603 ఎకరాల్లో, మహేశ్వరం క్లస్టర్‌ 310 ఎకరాల్లో అభివద్ధి చేస్తున్నారు. ఇబ్రహీంపట్నంలోని ఖాల్సా గ్రామంలో 123 ఎకరాల్లో ఏర్పాటుకు ఫైబర్‌ గ్లాస్‌ కాంపోజిట్‌ క్లస్టర్‌ను ప్రతిపాదించారు.సంగారెడ్డి జిల్లా షాబాద్‌ మండలంలో చందన్‌వల్లిలో ఇండిస్టీయల్‌ పార్క్‌ను అభివద్ధి చేశారు. ఇది మల్టీ ప్రొడక్ట్‌ ఇండిస్టీయల్‌ పార్క్‌. 20వేల ఎకరాల్లో ప్రతిపాదించారు అత్యుత్తమ కార్పెట్‌ టైల్స్‌ తయారీ సంస్థ వెల్‌ స్పన్‌ ఫ్లోరింగ్‌, గ్రీన్‌ కార్పెట్స్‌, ఇప్పటికే ఇక్కడ ఉత్పత్తులు ప్రారంభించాయి. దండుమల్కాపూర్‌లో తెలంగాణ ఇండిస్టియల్‌ ఫెడరేషన్‌ (టీఐఎఫ్‌) భాగ స్వామ్యంతో ఎంఎస్‌ఎంఈల అభివృద్ధి కోసం 523 ఎకరాల్లో గ్రీన్‌ ఇండిస్టీయల్‌ పార్క్‌ను అభివృద్ధి చేశారు. ఇందులో 621 కంపెనీలకు ఇప్పటికే భూములను కేటాయించారు. సుల్తాపూర్‌లో ఎఫ్‌టీసీసీఐ లేడీస్‌ ఆర్గనైజేషన్‌కు 50 ఎకరా లు కేటాయించారు. ఎంఎస్‌ఎంఈల గ్రీన్‌ ఇండిస్టియల్‌ పార్క్‌ ఏర్పాటునకు 26 కంపెనీలకు భూముల కేటాయిం చారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌ చెరు మండలం సుల్లాన్‌ పూర్‌ లో 250 ఎకరాల్లో మెడికల్‌ డివైజెస్‌ పార్క్‌ను అభివద్ధి చేశారు. 1,190 ఎకరాల్లో ప్రపంచస్థాయి మౌలిక సదుపా యాలతో అభివృద్ధి చేశారు.
ఐటీ రంగంలోనూ..
ఐటీ రంగంలోనూ తెలంగాణ రాష్ట్రం మేటిగా నిలిచింది. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచి ఐటీ వార్షిక ఎగుమతుల విలువ రూ.57వేల కోట్ల నుంచి రూ.1.83 లక్షల కోట్లకు పెరిగింది. 220 శాతం వద్ధిరేటు నమోద యింది. ఐటీ ఉద్యోగాల నియామకాలలో కూడా 156 శాతం వద్ధి ఉండటం విశేషం. 2014 నాటికి తెలంగాణలో కేవలం 3.24 లక్షల మంది ఐటీ ఉద్యోగులు ఉంటే, ఇప్పుడు వారి సంఖ్య 9.27లక్షల పెరిగింది. ఐటీ రంగాన్ని హైదరాబాద్‌ నగరానికే పరిమితం చేయకుండా రాష్ట్రంలోని ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరించారు. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌, సిద్ధిపేటలలో కూడా ఐటీ టవర్లను నిర్మించారు. ఇటీవల దావోస్‌లో జరిగిన వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సదస్సులో తెలంగాణకు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి. అనేక అంతర్జాతీయ సదస్సులకు ఆహ్వానాలు అందుతున్నాయి.
గతంలో వచ్చిన దిగ్గజ సంస్థలతోపాటు ఇంగ్లాండు, అమెరికాల నుంచి కూడా అనేక ప్రఖ్యాతి గాంచిన సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ముం దుకు వచ్చాయి. కొన్ని సంస్థలు అక్కడికక్కడే ఒప్పందాలు కూడా చేసుకున్నాయి. వినూత్న ఆవిష్కరణలతో ముందుకు వచ్చే యువ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు టీ-హబ్‌, వీ-హబ్‌, టీ-వర్క్స్‌, రీచ్‌ సంస్థలు దోహద పడుతున్నాయి. వినూత్న స్టార్టప్‌లకు సంబంధించిన ఆవిష్కరణలతో టీ-హబ్‌ దేశంలోనే రికార్డు సష్టించింది. అందుకే టీహబ్‌-2ను కూడా ప్రభుత్వం ప్రారంభించింది. 2022లో భారత ప్రభుత్వం నిర్వహించిన నేషనల్‌ స్టార్టప్‌ అవార్డులల్లో టీ-హబ్‌ ఉత్తమ ఇంక్యుబేటర్‌గా నిలిచిందని సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్‌ వివరించారు.

Spread the love