జనసేనకే గాజుగ్లాసు గుర్తు : హైకోర్టు

నవతెలంగాణ – ఆంధ్రప్రదేశ్ : జనసేన పార్టీకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఊరట కల్పించింది. పార్టీ సింబల్ పై దాఖలైన పిటిషన్ ను తోసిపుచ్చింది. దీంతో గాజు గ్లాసు గుర్తు జనసేనకే చెందనుంది. ఈమేరకు మంగళవారం ఏపీ హైకోర్టు తీర్పు వెల్లడించింది. గాజు గ్లాసు కోసం తాము దరఖాస్తు చేసుకుంటే ఎన్నికల కమిషన్ (ఈసీ) నిబంధనలకు విరుద్ధంగా దానిని జనసేనకు కేటాయించిందని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఏపీ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు.. తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పును వెలువరించనున్నట్లు వెల్లడించింది. ఏపీ హైకోర్టు తీర్పుతో గ్లాసు గుర్తు తమకే దక్కడంపై జనసైనికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

 

Spread the love