భార్య అనారోగ్యంతో మరణించగా ఆమె మరణాన్ని తట్టుకోలేక భర్త గుండె ఆగిపోయిన. హృదయవిదారక ఘటన రుద్రంగి మండల కేంద్రంలో చోటు చేసుకుంది.గ్రామానికి చెందిన గసికంటి పద్మ ఇటీవల అనారోగ్యం బారిన పడడంతో బంధువులు ఆసుపత్రిలో చేర్పించారు.విషయం తెలుసుకుని గల్ఫ్ దేశంలో ఉన్న భర్త శంకర్ ఇండియా కు వచ్చాడు.ఇరవై రోజుల క్రితం ఆమె మరణించడంతో దహన సంస్కారాలు పూర్తి చేశాడు. జీవితాంతం కలిసుంటా నని ప్రమాణం చేసి వివాహం చేసుకున్నా జీవిత భాగస్వామి అర్దాంతరంగా మరణించడంతో ఆమె మరణాన్ని తట్టుకోలేక గురువారం శంకర్ గుండెపోటుతో మరణించాడు. ఈ ఘటన గ్రామస్తులను కంటతడి పెట్టించింది.