నిజామాబాద్ అభివృద్ధికి బ్రహ్మరథం పడుతున్న నగర ప్రజలు

– ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ లో చేరిన టీవీ టెక్నీషియన్ యూనియన్ సభ్యులు
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని టీవీ టెక్నికల్ యూనియన్ సభ్యులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గణేష్ బిగాల ఆధ్వర్యంలో 100 మంది బీఆర్ఎస్ మంగళవారం లో చేరారు. టీవీ టెక్నీషియన్ యూనియన్ సభ్యులకు సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు మాట్లాడుతూ..నిజామాబాద్ నగర అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్ లో చేరడానికి బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. మొదటిరోజు రజక సేవా సంఘం సభ్యులు, రెండవ రోజు టీవీ టెక్నీషియన్ యూనియన్ సభ్యులు చేరడం శుభ పరిమాణం అని అన్నారు.నిజామాబాద్ నగరం వేగంగా అభివృద్ధి చెందుతుంది. నగరం సుందరీకరణ, పచ్చదనం, సెంటర్ మీడియన్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు ప్రజలను కనువిందు చేస్తున్నాయి.కేసీఆర్ నాయకత్వాన్ని బలోపేతం చేయడానికి, అభివృద్ధి పనులకు ఆకర్షితులయి బి ఆర్ ఎస్ పార్టీ లో చేరుతున్నారు.బి ఆర్ ఎస్ లో చేరిన కార్యకర్తలు ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలు వివరించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నగర అధ్యక్షులు సిర్ప రాజు, టీవీ టెక్నీషియన్ యూనియన్ సభ్యులు ప్రశాంత్, భూమేశ్వర్, శ్రీనివాస్, రాజు, మహేందర్ గంగాధర్, రాము తదితరులు పాల్గొన్నారు.

 

Spread the love