గత ప్రభుత్వం అప్పులు మిగిల్చింది

– రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌
నవ తెలంగాణ హుస్నాబాద్‌ రూరల్‌
గత ప్రభుత్వం ఎన్ని అప్పులు మిగిల్చినా… ప్రజలకు మంచి చేయాలని దఢ నిశ్చయంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం ముందుకు వెళుతోందని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం హుస్నాబాద్‌లోని మున్సిపల్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ ఆవరణలో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ప్రజలనుండి ప్రభుత్వ గ్యారంటీ పథకాలపై దరఖాస్తులను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర రవాణా బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజులలోనే కాంగ్రెస్‌ 420 అని బీఆర్‌ఎస్‌ నాయకులు విమర్శించడం తగదన్నారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి ఓటు వేస్తే ఎమ్మెల్యేగా ఎన్నికై రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించానని, హుస్నాబాద్‌ నియోజకవర్గ ప్రజలను మరవనని ఎల్లప్పుడూ అండగా ఉంటానని అన్నారు. మీకు ఏ సమస్య ఎదురైనా నా దష్టికి తీసుకువస్తే వెంటనే స్పందించి పరిష్కరించే బాధ్యత నాదన్నారు. ఇప్పటికే రెండు గ్యారెంటీలను అమలు చేశామని అన్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి ప్రజాపాలన కార్యక్రమం ఉంటుందని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హుస్నాబాద్‌ నియోజకవర్గంలో ఇప్పటికే 85 వేల అప్లికేషన్లను స్వీకరించామని తెలిపారు. ప్రజాస్వామ్య పునరుద్ధరించడానికి హైదరాబాదులో ధర్నా చౌక్‌ను ప్రారంభించామన్నారు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా అవసరమైన రిపేర్లు పూర్తి చేసి అందిస్తామన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. సీడీఎంఏ బృందం నిన్ననే హుస్నాబాద్‌కు వచ్చి పరిశీలించిందని, గౌరవెల్లి నిర్వాసితులతో దురుసుగా ప్రవర్తించకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రవర్తించి సమస్య పరిష్కరిస్తామన్నారు. రాష్ట్ర ఇరిగేషన్‌ మంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించామని, ఇంకా 2 వేల ఎకరాల భూసేకరణ చేసి డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్‌ నిర్మిస్తామన్నారు. దేవాదుల, శ్రీరామ్‌సాగర్‌, వరద కాలువ ఫేస్‌ 2 ద్వారా నీళ్లు వచ్చేలా చర్యలు చేపడతామన్నారు. మున్సిపల్‌ పట్నంలోని హమాలీలకు హెల్త్‌ ప్రొఫైల్‌ టెస్ట్‌ చేపించే అవసరమైన వైద్య సేవలు అందిస్తామన్నారు. నిమ్స్‌ ఎం.ఎన్‌.జె తదితర ఆస్పత్రులలో వైద్య సేవల కోసం వస్తే ఒక ప్రత్యేక వ్యక్తిని అందుబాటులో ఉంచి ప్రత్యేకమైన వైద్య సేవలు రాజకీయాలకతీతంగా ఈ ప్రాంతం వారికి చేయిస్తానని చెప్పారు. విద్యా, వైద్యం, గహవసతి, ఉద్యోగులు, సామాన్య ప్రజలు, రైతుల తదితరులు అందరి సమస్యలు పరిష్కరిస్తానన్నారు. హుస్నాబాద్‌ నుంచి ఏ ప్రాంతానికైనా బస్‌ సౌకర్యం కావాలనిపిస్తే నాకు చెప్పండి.. ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. హుస్నాబాద్‌ నియోజకవర్గ ప్రజలు ఎక్కడికి వెళ్లినా గౌరవం పెరిగేలా మీ ఇమేజ్‌ని పెంచుతానని తెలిపారు. కార్యక్రమంలో హుస్నాబాద్‌ ఆర్డీఓ బెన్‌ షాలేం, మున్సిపల్‌ చైర్మన్‌ ఆకుల రజిత, సింగిల్‌ విండో చైర్మన్‌ బొలిశెట్టి శివయ్య, ఏసీపీ సతీష్‌, మున్సిపల్‌ కమిషనర్‌ రాజశేఖర్‌, కౌన్సిలర్‌ పద్మ, ప్రజాప్రతినిధులు తదితరులు.
నవతెలంగాణ- కోహెడ
ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు. శనివారం మండల విస్తత స్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. అంబేద్కర్‌ చేరస్తా వరకు ర్యాలీగా చేరుకొని అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం శ్రీలక్ష్మీ గార్డెన్‌లో కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య ఆధ్వర్యంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. గ్రామాలవారీగా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీ సంక్షేమ పథకాలను అమలు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్‌ నాయకులు కాంగ్రెస్‌ విజయాన్ని ఓర్చుకోలేకనే ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం ఖజానా మొత్తం ఖాళీ చేసి రూ.ఏడు లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ప్రజాపాలనలో దరఖాస్తులు సైతం ఉచితంగా పంపిణీ చేసిన తీరును బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తట్టుకోవడం లేదన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించడాన్ని ఇతర పార్టీలు జీర్ణించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బస్వరాజు శంకర్‌, శెట్టి సుధాకర్‌, బందెల బాలకిషన్‌, మోహన్‌ రెడ్డి, వేల్పుల వెంకటస్వామి, చింతకింది శంకర్‌, దొమ్మాట జగన్‌ రెడ్డి, ముంజ తిరుపతి, కొంకటి దామోదర్‌, గూడ స్వామి తదితరులు పాల్గొన్నారు.

Spread the love