నవ తెలంగాణ -నారాయణపేట టౌన్
అన్ని అర్హతలు ఉన్న కోటకొండ గ్రామాన్ని మండలం ఏర్పాటుతోనే మాకు నిజమైన సంబరా లని బీజేపీ రాష్ట్ర నాయకులు కెంచె శ్రీనివాస్, సీపీఐఎంఎల్ ప్రజాపంథా జిల్లా నాయకులు కాశీనాథ్, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బలరాం అన్నారు. మే10 నుండి ప్రారంభించిన రిలే దీక్షలు శనివారానికి 25 రోజులు అయినా స్థానిక ఎమ్మెల్యే ఎస్. రాజేందర్ రెడ్డి స్పందిం చకపోవడం శోచనీయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దీక్షలకు నాయీ బ్రాహ్మణ సంగం నేత సుభాష్ అధ్యక్షత వహించారు. కోటకొండ చుట్టూ ఉన్న పది గ్రామాలకు కోటకొండ మండలం ఏర్పాటుతోనే నిజమైన తెలంగాణ సం బరాలు అందుతాయని వెల్లడించారు. ఉత్సవాలు కాదని ఉద్యమంలోకి రావా లని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయ లక్ష్మి, మండల సాధన సమితి కో -కన్వీనర్లు యా దగిరి, చెన్నప్ప యాదవ్, సాకా ప్రవీణ్, ఎడ్ల రాజు, గుండెగారి దస్తప్ప,అభంగాపూర్ గ్రామ ఉప సర్పంచ్ బలరాం, వనవా సి పరిషత్తు నాయకులు రమేష్, సీపీఎంఎల్ ప్రజాపంథా గ్రామ కార్యదర్శి ఎదిరింటి నరసింహ, పీవైఎల్ నాయకులు సలీం, యూనివర్సిటీ నాయకులు జి. మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.