రెజ్లర్ల పోరాటం కేంద్ర బీజేపీకి కనబడటం లేదా

నవతెలంగాణ-చంద్రుగొండ
రేజర్ల పోరాటం కేంద్ర బీజేపీ పార్టీకి కనపడటం లేదా అని సీపీఐ(ఎం) మండల కమిటీ సభ్యులు పెద్దని వేణు విమర్శించారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశంలో వేణు మాట్లాడుతూ దేశానికి క్రీడల్లో పేరు ప్రఖ్యాతలు, అనేక మెడల్స్‌ను తీసుకొచ్చిన రెజ్లర్లను అరాస్మెంట్‌ చేసి, మానసికంగా ఇబ్బందులు కలగజేసిన బీజేపీ ఎంపీ బ్రిజేష్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ను పదవి నుంచి తొలగించి, అతని మీద కేసు వేయకుండా కేంద్రం కాలయాపన చేస్తుందన్నారు. ఈ సమావేశంలో మండల కమిటీ సభ్యులు రామడుగు వెంకటాచారి, రాయి రాజా, విప్పర్ల పెద్ద వెంకటేశ్వర్లు, అప్పారి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Spread the love