నవతెలంగాణ ఛత్తీస్గఢ్: తెలంగాణ – ఛత్తీస్గఢ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లాలో పామేడు పరిధిలోని చింతవాగు, ధర్మారం, పామేడు క్యాంపులపై మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ మూడు క్యాంపులపై మావోయిస్టులు ఏకకాలంలో కాల్పులకు పాల్పడ్డారు. దీంతో భద్రతా బలగాలు అప్రమత్తమై మావోయిస్టుల కాల్పులను తిప్పికొట్టారు. మంగళవారం అర్ధరాత్రి ప్రారంభమైన కాల్పులు.. బుధవారం తెల్లవారుజాము వరకు కొనసాగాయి. పామేడు పరిస్థితులపై పోలీసులు ఉన్నతాధికారులు ఆరా తీశారు. ఈ మూడు క్యాంపుల పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరించారు. మావోయిస్టుల కోసం కూంబింగ్ కొనసాగిస్తున్నారు.