– ప్రొ పంజా లీగ్ సీజన్ 1
న్యూఢిల్లీ: ప్రొ పంజా లీగ్ (ఆర్మ్ రెజ్లింగ్)లో కిరాక్ హైదరాబాద్ మూడో విజయం నమోదు చేసింది. ఇందిరాగాంధీ స్టేడియంలో గురువారం జరిగిన మ్యాచ్ ముంబయి మజిల్పై 17-11తో ఏకపక్ష విజయం సాధించింది. అండర్ కార్డ్లో షాహిల్ హుస్సేన్, మధుర కెన్లు గెలుపొందగా.. మెయిన్ కార్డ్లో మధుర కెఎన్ 5-0తో, సిద్దార్థ్ మలాకర్ 10-0తో అదరగొట్టారు. స్పెషల్ కేటగిరీ మ్యాచ్లో ముంబయి ఆర్మ్ రెజ్లర్ చందన్ కుమార్ బెహార 10-0తో మెరిసినా.. హైదరాబాద్ విజయం అప్పటికే ఖరారైంది. నేడు లూధియాన లయన్స్తో కిరాక్ హైదరాబాద్ తలపడనుంది.