నవతెలంగాణ- హైదరాబాద్ : మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న ముగ్గురు నిందితులను గుడిమల్కాపూర్, టాస్క్ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి 7 గ్రాముల హెరాయిన్, 3 సెల్ఫోన్స్, యాక్టీవా బైక్ స్వాధీనం చేసుకున్నారు. విలాసాలకు అలవాటు పడిన మగ్గురు నిందితులు బెంగళూరులో ఉంటున్న నైజీరియన్ నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. డ్రగ్స్ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.