తిలక్ వర్మ తొలి హాఫ్ సెంచరీ రోహిత్ కూతురికి అంకితం

నవతెలంగాణ – హైదరాబాద్: తెలుగు యువ క్రికెటర్ తిలక్ వర్మ ఓ చిన్న పనితో నలుగురికీ ఆదర్శవంతంగా నిలిచాడు. వెస్టిండీస్ తో రెండో టీ20 మ్యాచ్ లో 41 బంతుల్లో వర్మ 51 పరుగులు సాధించాడు. భారత జట్టులో టాప్ స్కోరర్ వర్మ ఒక్కడే. తెలుగు తేజం మెరిసినప్పటికీ.. వెస్టిండీస్ వైపు నికోలస్ పూరన్ విధ్వంసకర బ్యాటింగ్ తో రెండో టీ20 మ్యాచ్ లోనూ భారత్ కు ఓటమి తప్పలేదు. ఈ మ్యాచ్ రూపంలో తిలక్ వర్మ తన తొలి టీ20 అర్ధసెంచరీని నమోదు చేశాడు. దీన్ని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కుమార్తె సమైరాకు అంకితమిస్తున్నట్టు ప్రకటించాడు. సమైరాతో తనకు మంచి అనుబంధం ఉన్నట్టు మ్యాచ్ తర్వాత మీడియా సమావేశంలో వర్మ వెల్లడించాడు. తొలి అర్ధ సెంచరీ లేదా సెంచరీని సాధించినప్పుడు సంబరపడేలా చేస్తానని తాను సమైరాకి చెప్పినట్టు పేర్కొన్నాడు.

Spread the love