పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలి..

– ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క
నవతెలంగాణ-కొత్తగూడ:- పేద ప్రజలకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్ పార్టీని అఖండ మెజారిటీతో గెలిపించాలని ములుగు ఎమ్మెల్యే దనసరి సీతక్క అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే సీతక్క పాల్గొని మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మేనిఫెస్టోలో ఉన్న విధంగా సంక్షేమ పథకాలను కచ్చితంగా అమలు చేస్తామని దానిపై ఎటువంటి అనుమానం అవసరం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలసికట్టుగా పనిచేసి అదిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు బొల్లు రమేష్, నోముల ప్రశాంత్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ముగ్గురు కార్యకర్తలకు కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బానోత్ విజయ రూప్ సింగ్, జెడ్పిటిసి పులుసం పుష్పలత, వైస్ ఎంపీపీ కాడబోయిన జంపయ్య, గంగారం ఎంపీపీ సువర్ణపాక సరోజన జగ్గారావు, జెడ్పిటిసి ఈసం రమ, గార్ల మండలం సీతంపేట ఎంపీటీసీ గుండెబోయిన నాగమణి,గంగారం మండల పార్టీ అధ్యక్షులు జాడి వెంకటేశ్వర్లు, టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ చల్ల నారాయణరెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి బిట్ల శ్రీనివాస్, మండల నాయకులు రాజం సారంగం, గుమ్మడి సమ్మయ్య,కంగాల నాగేశ్వరరావు, లతోపాటు సర్పంచులు,ఎంపిటిసిలు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Spread the love