నేడు మండల కేంద్రంలో రోడ్ షో ను విజయ వంతం చేయాలి

నవతెలంగాణ – తొగుట
మండల కేంద్రంలో రోడ్ షో ను విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అక్కo స్వామి, ఎంపీపీ గాంధారి లతా నరేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం నియోజక వర్గ కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. బుధవారం సాయంత్రం 4 గంటలకు కార్నర్ మీటింగ్ కు విజయవంతం చేయాలని కోరారు. మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగే రోడ్ షో నాయకులు, కార్య కర్తలు, ప్రజలు పాల్గొని విజయవంతం చేయాల న్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గొల్లపల్లి కనకయ్య, మాజీ ఎంపీపీ గంట రేణుక రవీందర్, మాజీ సర్పంచు చెరుకు విజయ్ రెడ్డి, నాయకులు యెన్నం భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Spread the love