రేపే ఆరో దశ పోలింగ్‌ ముగిసిన ప్రచార పర్వం

– ఎనిమిది రాష్ట్రాల్లో 58 లోక్‌సభ స్థానాలకు 889 మంది అభ్యర్థులు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభ ఎన్నికల ఆరో దశ పోలింగ్‌కు సంబంధించిన ప్రచారపర్వం గురువారం సాయంత్రం 5 గంటలతో ముగిసింది. ఎనిమిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి 58 నియోజకవర్గాలకు రేపు (శనివారం) పోలింగ్‌ జరగనుంది. 889 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. ఆరో దశలో ఉత్తరప్రదేశ్‌లో 14, బీహార్‌లో ఎనిమిది, హర్యానాలో పది, ఢిల్లీలో ఏడు, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిది, జార్ఖండ్‌లో నాలుగు, ఒడిశాలో ఆరు స్థానాలకు పోలింగ్‌ జరగనుంది. అయితే మూడో దశ (మే 6)లో జరగాల్సిన జమ్మూకాశ్మీర్‌లోని అనంతనాగ్‌ లోక్‌సభ నియోజకవర్గం పోలింగ్‌, మే 25 ఆరో దశ పోలింగ్‌ కు మార్చారు. జమ్మూకాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, హర్యానా మాజీ ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ కట్టర్‌, కాంగ్రెస్‌ నేతలు కన్నయ్య కుమార్‌, దీపేందర్‌ సింగ్‌ హుడా, బీజేపీ నేత మనోజ్‌ తివారీ బరిలో ఉన్నారు.

Spread the love