ఉపాద్యాయుల బదిలీలతోపాటు ప్రమోషన్లను వెంటనే చేపట్టాలి

– టిటియూ జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి
నవతెలంగాణ – సిరిసిల్ల
వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయ బదిలిలతో పాటు ప్రమోషన్సలను  వెంటనే చేపట్టాలని టిటియు జిల్లా అధ్యక్షుడు కొండికొప్పుల రవి ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఉపాధ్యాయ పదోన్నతులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. బదిలీల కోసం పదోన్నతుల కోసం ఉపాధ్యాయులు ఆందోళన గురవుతున్నారని అన్నారు.ఎన్నో ఏళ్ల నుంచి బదిలీలు కల్పించకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి తడుకల సురేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయులను పూర్తిస్థాయిలో కేటాయించకపోవడంతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. పేద విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ వేసవి సెలవులలో ఉపాధ్యాయులకు వెంటనే బదిలీలతోపాటు ప్రమోషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.. ఈ కార్యక్రమంలో ఉపాద్యాయులు సుధాకర్ రెడ్డి, పోచయ్య, చిరంజీవిలు పాల్గొన్నారు..
Spread the love