అధికారుల నిర్లక్ష్యం వల్లే సెలవులు పొడిగించలేదు : టీఎస్‌పీటీఏ

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే వేసవి సెలవులను పొడిగించలేదని తెలంగాణ రాష్ట్ర ప్రాథమిక ఉపాధ్యాయ సంఘం (టీఎస్‌పీటీఏ) అధ్యక్షులు సయ్యద్‌ షౌకత్‌అలీ, ప్రధాన కార్యదర్శి పిట్ల రాజయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తీవ్రమైన ఎండల తీవ్రత వల్ల పాఠశాలలకు పది శాతం మంది పిల్లలు కూడా హాజరు కాలేదని పేర్కొన్నారు. ఈ వేడిలో ఎందుకు బడులను తెరిచారంటూ ఉపాధ్యాయులను ప్రశ్నిస్తున్నారని తెలిపారు. విద్యాశాఖ కార్యదర్శి, సంచాలకులు ఏదైనా పాఠశాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి వారి అభిప్రాయాలను చెప్తే బాగుంటుందని సూచించారు. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా వెంటనే పాఠశాలలకు సెలవులను పొడిగించాలని డిమాండ్‌ చేశారు.

Spread the love