15 నుంచి సివిల్స్‌ ఆప్షనల్‌ ఎంపికపై ఉచిత అవగాహన సదస్సు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) నిర్వహించే సివిల్స్‌ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఆప్షనల్‌ ఎంపికపై ఈనెల 15 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాద్‌లోని అశోక్‌నగర్‌లో ఉచిత అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్టు అమిగోస్‌ 21వ సెంచరీ ఐఏఎస్‌ అకాడమి ప్రకటించింది. ఈ మేరకు అకాడమి నిర్వాహకులు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. వివిధ సబ్జెక్టు లపై సీనియర్‌ అధ్యాపకులతో ఈ అవగాహన తరగతులుం టాయని తెలిపారు. విద్యావేత్త ఆకెళ్ల రాఘవేంద్ర పర్యవేక్షణ లో నిర్వహించే ఈ సదస్సులో సిలబస, నోట్స్‌ మేకింగ్‌, మెంటర్‌సిప్‌ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తామని పేర్కొన్నారు. ఇతర వివరాలకు 040- 35052121, 9000230735 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.

Spread the love