సరిహద్దు చెక్ పోస్ట్ ల వద్ద అప్రమత్తంగా ఉంటూ తనిఖీ చేయాలి: ఎస్పీ


నవతెలంగాణ – రుద్రంగి
లోక్ సభ ఎన్నికల సందర్భంగా రుద్రంగి పోలీస్ స్టేషన్ మానాల క్రాస్ రోడ్ వద్ద ఏర్పాటు చేసిన చెక్ పోస్ట్ బుధవారం జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆకస్మిక తనిఖీ చేసి చేసి వాహనాల నెంబర్లు నమోదు రిజిస్టర్ పరిశీలించడంతో పాటు,ప్రత్యక్షంగా పోలీస్ సిబ్బంది వాహనాలు తనిఖీలు చేస్తున్న తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. తనిఖీల సమయంలో సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించడంతో పాటు,వాహనాలను క్షుణ్ణముగా తనిఖీ చేసి అక్రమ నగదు, మద్యం రవాణాను అరికట్టాలని సూచించారు.ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన రోజు నుండి ఈ రోజు వరకు  జిల్లాలో రూ. 65,99,900 రూపాయలు స్వాధీనం చేసుకోని  జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించడం జరిగిందని అన్నారు. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి డబ్బులు, మద్యం,ఇతర విలువైన వస్తువులు తీసుకొని వెళ్తున్నట్లు సమాచారం ఉంటే డయల్ 100 కి లేదా సంబంధిత పోలీస్ స్టేషన్ వారికి సమాచారం అందించాలని సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు ఎవరైనా పాల్పడిన, ఎన్నికల నియమావళి ప్రకారం ప్రకారం చట్ట రీత్యా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
Spread the love