– పుణెరి పల్టాన్తో హర్యానా స్టీలర్స్ ఢ
– ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ఫైనల్ నేడు
నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ టైటిల్ పోరుకు రంగం సిద్ధమైంది. రెండు సార్లు ఫైనలిస్ట్ పుణెరి పల్టాన్తో తొలిసారి ఫైనలిస్ట్ హర్యానా స్టీలర్స్ ఢకొీట్టనుంది. వరుసగా రెండో సీజన్లో పుణెరి పల్టాన్కు అంతిమ సమరానికి సిద్ధమైనా.. తొలి టైటిల్ కోసం తహతహ లాడుతోంది. తొలిసారి ఫైనల్స్కు చేరుకున్న హర్యానా స్టీలర్స్ సైతం ఇప్పుడే టైటిల్ కొట్టాలని పట్టుదల ప్రదర్శిస్తోంది. కెప్టెన్ అస్లాం ఇమామ్దార్ నాయకత్వం పుణెరి పల్టాన్కు, జైదీప్ సింగ్ సారథ్యం హర్యానా స్టీలర్స్కు అదనపు బలాలు. గ్రూప్ దశలో అగ్రస్థానం, సెమీఫైనల్లో మూడు సార్లు చాంపియన్ పట్నా పైరేట్స్పై పంజా విసిరి పుణెరి పల్టాన్ ఫైనల్కు చేరుకోగా.. గ్రూప్ దశలో టాప్-6లో నిలిచి ప్లే ఆఫ్స్ నుంచి వచ్చి సెమీఫైనల్లో డిఫెండింగ్ చాంపియన్ జైపూర్ పింక్ పాంథర్స్ను చిత్తు చేసి హర్యానా స్టీలర్స్ ఫైనల్కు చేరుకుంది. టైటిల్ వేటలో పుణెరి పల్టాన్, హర్యానా స్టీలర్స్ భిన్న తరహాలో తుది పోరుకు చేరుకున్నాయి. కానీ ఒక అంశంలో ఇరు జట్ల విజయ సూత్రం ఒకటే. ప్రత్యర్థి జట్లు కూతలో పల్టాన్, స్టీలర్స్తో సమవుజ్జీలుగా నిలిచాయి. కానీ ట్యాకిల్స్లో ఈ రెండు జట్లు తిరుగులేని ఆధిపత్యం చెలాయించాయి. ఇప్పుడు ఫైనల్లో ఇరు జట్లు తాడోపేడో తేల్చుకోనుండగా రెయిడింగ్, డిఫెన్స్ ఆసక్తికర సమీకరణంగా మారాయి. గ్రూప్ దశ ముఖాముఖి మ్యాచుల్లో ఓ మ్యాచ్లో పుణెరి పల్టాన్ పైచేయి సాధించగా, ఓ మ్యాచ్లో హర్యానా స్టీలర్స్ గెలుపొందింది. సీజన్లో ముచ్చటగా మూడోసారి ఢకొీంటున్న హర్యానా స్టీలర్స్, పుణెరి పల్టాన్ నేడు టైటిల్ విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతున్నాయి. ప్రొ కబడ్డీ లీగ్ పదో సీజన్ ఫైనల్ నేడు రాత్రి 8 గంటలకు ఆరంభం కానుంది.