హామీలపై మాట్లాడరెందుకు..?

– సీఎం రేవంత్‌కు బీఆర్‌ఎస్‌ నేత రావుల సూటి ప్రశ్న
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలపై సీఎం రేవంత్‌ ఎందుకు నోరుమెదపటం లేదని బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత రావుల శ్రీధర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు కొండంత..అమలు చేసింది గోరంతని విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడు తూ…అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లో రేవంత్‌ సర్కార్‌ అన్ని వర్గాల ప్రజలనూ మోసం చేసి ందని విమర్శించారు. మైనారిటీలకు రిజర్వేషన్లు, ఉద్యోగాల కల్పన, ఇమా మ్‌లు, మౌజామ్‌లు, పాస్టర్లకు వేతనాల పెంపు తదితరాంశాలపై జనానికి మొండి చేయి చూపిందని ఎద్దేవా చేశారు. అందువల్ల లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని చూసి మోసపోవద్దని కోరారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిం చాలని విజ్ఞప్తి చేశారు.

Spread the love