ఇంకుడు గుంతల నిర్మాణంలో మహిళా సంఘాలు భాగస్వాములు కావాలి

– ఎంపీడీవో వెంకయ్య
నవతెలంగాణ-శంకర్‌పల్లి
ఇంకుడు గుంతల నిర్మాణంలో మహిళా సంఘాలు భాగస్వాములు కావాలని శంకర్పల్లి ఎంపీడీవో వెంకయ్య అన్నారు. స్వచ్ఛ డ్రైవ్‌ లో భాగంగా మంగళవారం శంకర్‌పల్లి మండల పరిధిలోని మోకిల గ్రామంలో సర్పంచ్‌ సుమిత్ర మోహన్‌ రెడ్డితో కలిసి వీవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంకుడు గుంతల నిర్మాణంలో మహిళా సంఘాలు తప్పనిసరిగా భాగస్వాములు కావాలని కోరారు. ఇంకుడు గుంతల నిర్మాణంతో భూగర్భ జలాలు వృద్ధి చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపిఎం భీమయ్య, ఏపీఓ నాగభూషణం, సీసీలు మహిళా సంఘాల సభ్యులు తదితరులు ఉన్నారు.

Spread the love