- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఆదివారం 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. యోగా దినోత్సవం సందర్భంగా యోగ గురువు సంజీవ్ ఆధ్వర్యంలో యోగ ఆసనాలు, ప్రాణాయామం, యోగ ప్రాముఖ్యతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, యోగా గురువు, గ్రామస్తులు పాల్గొన్నారు.
- Advertisement -



