ఉరి వేసుకుని యువకుడు ఆత్మహత్య..

నవతెలంగాణ-హైదరాబాద్ : రాజన్న సిరిసిల్ల పట్టణం రాజీవ్ నగర్ కు చెందిన గూడూరి సాగర్ కొద్ది రోజుల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. తరుచూ భార్య భర్తల మధ్య గొడవలు జరగడం తో మనస్థాపం చెంది కోనరావుపేట మండలం కొలనూరు గ్రామంలో బిల్డింగ్ కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతిని తండ్రి గూడూరు బాబు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు.

Spread the love