– చికిత్స పొందుతూ ఒకరి మృతి
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులో ఈ నెల 22న రాజీవ్ రహదారిపై నిలిచి ఉన్న లారీని కారు డికోట్టిన సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయలయ్యాయి. గాయపడిన వారిని మేరుగైన చికిత్స కోసం కరీంనగర్ పట్టణంలోని ప్రయివేటు ఆస్పత్రికి తరలించారు.గాయపడిన వారిలో రాజకుమారి చికిత్స పొందుతూ మృతి చెందినట్టు ఎస్ఐ క్రిష్ణారెడ్డి సోమవారం తెలిపారు. గాయపడిన మరో వ్యక్తి రవీందర్ చికిత్స పొందుతున్నాడు.ఎలాంటి హెచ్చరిక సూచికలు ఏర్పాటు చేయకుండా రహదారిపై లారీని నిలిపి ప్రమాదానికి కారమైన డ్రైవర్ పై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ క్రిష్ణారెడ్డి తెలిపారు.