అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య

నవతెలంగాణ- రామారెడ్డి
అనారోగ్యంతో బాధపడుతూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని ఉప్పల్వాయి గ్రామానికి చెందిన ఆకుల లింగం (46) బ్రెన్ స్ట్రోక్ రావడంతో, గత కొన్ని రోజుల నుండి అనారోగ్యంతో బాధపడుతూ, నడవడానికి ఇబ్బందిగా ఉండటంతో, జీవితంపై విరక్తి చెంది పశువుల కొట్టం లోని పందిరి కట్టెకు విద్యుత్ కేబుల్ వైర్ తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు భార్య ఆకుల పద్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు ఏఎస్ఐ రవీందర్ తెలిపారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Spread the love